కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. దేశాన్ని విభజించి, చీల్చి బలహీనపరచాలని కాంగ్రెస్ ఆలోచిస్తుందని ఆరోపించారు. హిందూ మతంలో శక్తిని నిర్వీర్యం చేయాలని వారు కోరుకుంటున్నారని చెప్పారు. కానీ మోదీ ఉన్నంతవరకు ఈ విద్వేష శక్తులు ఎన్నడూ తమ ప్రయత్నాల్లో సఫలం కాబోవని తెలిపారు. ఇది మోదీ గ్యారంటీ అని అన్నారు. తమిళనాడులోని మైసూర్లో ప్రధాని మోదీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం నిప్పుతో చెలగాటమాడుతోందని విమర్శించారు. 2024 లోక్సభ ఎన్నికలు కేవలం రాబోయే ఐదేండ్లకు పాలకులను నిర్ధారించేవి కావని 2027 నాటికి వికసిత్ భారత్గా ఆవిర్భవించేందుకు దిశానిర్ధేశం చేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు.