పవర్ లేనివాళ్లకు పవర్‌‌ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు? : బండ్ల గణేశ్

పవర్ లేనివాళ్లకు పవర్‌‌ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు? : బండ్ల గణేశ్

 

హైదరాబాద్, వెలుగు: పవర్ లేనోళ్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకని కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ ప్రశ్నించారు. మాట్లాడితే గత పాలకులు అంటూ విమర్శించడం కాదని, గత పదేండ్లలో బీఆర్‌‌ఎస్ సర్కార్ ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. కేటీఆర్ రిలీజ్ చేసిన స్వేదపత్రంపై ఆదివారం ఆయన ఓ వీడియోను రిలీజ్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు.

 ‘‘మీరు ఏం చేశారు.. ఏం దోచుకున్నారు.. ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్లారో మేం చెప్తాం. తెలంగాణ ప్రజలు ఎంత వెనుకబడ్డారో.. మీరు ఎంత ముందుకెళ్లారో మేం చెప్పగలం. మేం చెప్పింది జనాలు నమ్మారు కాబట్టే.. అవి నిజాలని నమ్మారు కాబట్టే మాకు అధికారం ఇచ్చారు. అధికారం చేపట్టి నెల కాకముందే మీకు ఎందుకు అంత ఆత్రుత. ఎందుకంత బాధ. ఎందుకంత భయం. కాస్త వెయిట్ చెయ్యండి.. టైమ్ ఇయ్యండి.. మేం అద్భుతంగా పాలిస్తాం’’ అని పేర్కొంటూ వీడియోను రిలీజ్ చేశారు.