నేషనల్ కాంగ్రెస్ లో జీ23 గ్రూప్ లో కీలకంగా ఉన్న గులాంనబీ ఆజాద్.. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు చాలా సేపు సమావేశమయ్యారు. భేటీ తర్వాత మాట్లాడిన ఆయన.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించినట్టు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై డిస్కస్ చేశామన్నారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగాలని తాము ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామన్నారు ఆజాద్. అయితే.. తాము కొన్ని సలహాలు మాత్రం ఇచ్చామని చెప్పారు.
The meeting with Sonia Gandhi was good. All members of the Congress party decided unanimously that she should continue as the president, we just had some suggestions that were shared: Congress leader Ghulam Nabi Azad after meeting party president Sonia Gandhi pic.twitter.com/OSSsZqekqw
— ANI (@ANI) March 18, 2022