మోడీ సర్కార్ వల్లే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది: మల్లు రవి

మోడీ సర్కార్ వల్లే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది: మల్లు రవి

కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేసిన అప్పుల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మాజీ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి విలువ ఐసీయూలో ఉందన్నారు. కాంగ్రెస్ కమిటీలలో అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కిందని చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చేందుకే కేసీఆర్ తో మోడీ బీఆర్ఎస్ పార్టీ పెట్టించారని మల్లు రవి ఆరోపించారు. 

పోరగాళ్లకు పదవులు ఇచ్చారన్న భట్టి విక్రమార్క వ్యాఖ్యలను టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ నాగరి ప్రీతం ఖండించారు. యువత, సీనియర్ల కాంబినేషన్ లో కమిటీలు ఉన్నాయని ప్రీతం చెప్పారు. ఇక కమిటీల్లో చోటు దక్కిన నేతలు గాంధీభవన్ లో సంబురాలు జరుపుకొన్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచారు.