ఏం ఉద్ధరించారని సంకల్ప యాత్ర.. బీజేపీపై కాంగ్రెస్ నేత పుష్పలీల ఫైర్

ఏం ఉద్ధరించారని సంకల్ప యాత్ర.. బీజేపీపై కాంగ్రెస్ నేత పుష్పలీల ఫైర్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణను ఏం ఉద్ధరించారని రాష్ట్రంలో బీజేపీ సంకల్ప యాత్రలు చేస్తుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు పుష్పలీల ఆ పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముం దు మోదీ, అమిత్ షాలు తెలంగాణలో ఎన్ని సార్లు పర్యటించినా ఇక్కడి ప్రజలు వారిని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.

అయినా తెలంగాణ రాజకీయాల్లో  పట్టుకోసం ఇంకా బీజేపీ పాకులాడుతోందని ధ్వజమెత్తారు. బుధవారం గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు కేంద్రం ఏం సహాయం చేసిందని ఈ సంకల్ప యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు మోదీ సర్కార్ చేసిందేమిటని ప్రశ్నించారు.