ఇదేనా బంగారు తెలంగాణ?

ఇదేనా బంగారు తెలంగాణ?

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కాంగ్రెస్ నేత,కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి స్పందించారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో కొత్తగా మరో ముగ్గురు మహిళలపై అఘాయిత్యం జరిగింది..పోలీసుల లెక్కలు చూస్తే..మహిళలపై అఘాయిత్యాల కేసులు పెరిగాయని వ్యాఖ్యానించారు. ఇదేనా బంగారు తెలంగాణ అని రేణుక చౌదరి ప్రశ్నించారు. పసి పిల్లలకు కూడా తెలంగాణలో రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ కేసులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉన్నారు కాబట్టే.. ఈ కేసు ను నీరుగారుస్తున్నారు. వేల కేసులు నమోదయితే.. 46 కేసులలో మాత్రమే దోషులకు  శిక్ష పడిందన్నారు. మైనర్ బాలిక వీడియోను బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునంధన్ రావు కూడా దోషే అని రేణుక చౌదరి మండిపడ్డారు.రఘునంధన్ రావు ఇన్నోవా బండి వీడియో ఎందుకు బయటపెట్టలేదు ఆమె ప్రశ్నించారు.

రఘునంధన్ రావు సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారని.. పబ్ లో కాంగ్రెస్ నేతల పిల్లలు ఉంటే రఘునంధన్ రావు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.ఖమ్మంలో బీజేపీ కార్యకర్త వాంగ్మూలంలో మంత్రి పువ్వాడ తన చావుకు కారణం అని చెప్పినా.. చర్యలు కరువు అయ్యాయిని ఎద్దేవ చేశారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసు వదిలేది లేదు. ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని రేణుక చౌదరి విమర్శించారు. తెలంగాణ షీ టీమ్స్ ఏమైయ్యాయి..నగరంలో రక్షణ లేనప్పుడు పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రభుత్వాన్ని నిలదీశారు.

బీజేపీ విషయంలో టీఆర్ఎస్ యూ టర్న్ తీసుకుంది.. బీజేపీ,టీఆర్ఎస్ తోడుదొంగలు, కవల పిల్లల లాంటి వారని దుయ్యాబట్టారు. రాష్ట్రంలో పబ్బుల కల్చర్ పెరిగింది..లైసెన్స్ లు ఇస్తుంది ఎక్సైజ్ శాఖ కాదా అని ప్రశ్నించారు.సనాతన ధర్మం బీజేపీకి తెలుసా..మరోమతాన్ని కించరపరచడం సరైంది కాదు..ప్రపంచం ముందు సిగ్గుపడేలా బీజేపీ నేతల వ్యవహారం ఉందని రేణుక చౌదరి తప్పుబట్టారు.