కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్కు దిశలేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. యువత స్వరాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సోనియాగాంధీ స్పందించారు.
I'm sad that govt ignored your voice & announced a new scheme that is completely directionless... I appeal to all of you to protest peacefully in a non-violent manner. Indian National Congress is with you: Congress chief Sonia Gandhi on #AgnipathRecruitmentScheme pic.twitter.com/BdwjtQeyUK
— ANI (@ANI) June 18, 2022
ఆర్మీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువత శాంతియుతంగా, అహింసా పద్ధతిలో తమ డిమాండ్ల కోసం పోరాటం చేయాలని సోనియా కోరారు. నిరసన చేపడుతున్న యువతకు మద్దుతుగా కాంగ్రెస్ పార్టీ ఉందని, అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని సోనియాగాంధీ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.