ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం : కాంగ్రెస్ నాయకులు

ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం : కాంగ్రెస్ నాయకులు

చెన్నూర్, వెలుగు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. బుధవారం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రెస్​మీట్​లో కోటపల్లి మండల కాంగ్రెస్ నేతలు పోటు రామిరెడ్డి,లక్ష్మణ్ గౌడ్ మాట్లాడారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతారని జడ్పీ మాజీ వైస్ చైర్మన్ రాజి రెడ్డి చేసిన వ్యాఖ్య లను తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గంలో 

ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక, బియ్యం, అక్రమ వ్యాపారాలను అడ్డుకుంటుండడంతో ఆయన ప్రతిష్టతను దెబ్బతీసేందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మూల రాజరెడ్డి నీచమైన చరిత్ర నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. మరోసారి ఎమ్మెల్యే వివేక్​పై తప్పుడు ఆరోపణలు చేస్తే గ్రామాల్లో ప్రజలే తరిమికొడతారని హెచ్చరించారు.