క్యాతనపల్లి మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరించాలని .. ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామికి వినతి

క్యాతనపల్లి మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరించాలని .. ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామికి వినతి

కోల్​బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామికి కాంగ్రెస్​ లీడర్లు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్​ ఆధ్వర్యంలో లీడర్లు బుధవారం హైదరాబాద్​లో ఎమ్మెల్యేను కలిశారు. రామకృష్ణాపూర్​లో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు, వీధి వ్యాపారులు బిజినెస్ చేసుకోవడానికి స్థలం కేటాయింపు, రామకృష్ణాపూర్​లోని అబ్రహంనగర్​లో జనవాసాల ప్రాంతం మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్లు తొలగించేందుకు కృషి చేయాలని కోరారు. 

రామకృష్ణాపూర్ ​మీదుగా మంచిర్యాల–మందమర్రి ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ, బీజోన్ ​సెంటర్ ​నుంచి కనకదుర్గ కాలనీ వరకు బీటీరోడ్డు నిర్మాణం, సింగరేణి ఏరియా ఆస్పత్రిలో కార్మికేతరులకు వైద్య సేవలు కల్పించేలా సింగరేణి యాజమాన్యం నుంచి జీవో జారీ చేయించాలని ఎమ్మెల్యేను కోరారు.