తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 న కాంగ్రెస్ నేతలు పెండింగ్ ప్రాజెక్టుల వద్ద నిరసన దీక్షలు చేపట్టనున్నారు. కృష్ణా నది పై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీస్తూ.. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నారు. ఎస్ఎల్బీసి (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) వద్ద జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరసన దీక్ష చేయనుండగా.. పాలేరు జలాశయం వద్ద భట్టి విక్రమార్క, సీతక్క, పోడెం వీరయ్య.. లక్ష్మీదేవిపల్లి పంపు హౌస్ వద్ద రేవంత్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి దీక్ష చేయనున్నారు. ఎల్లూరు జలాశయం వద్ద నాగం జనార్దన్ రెడ్డి, కరివేన వద్ద చిన్నారెడ్డి, నెట్టెంపాడు వద్ద సంపత్ కుమార్, కల్వకుర్తి వద్ద వంశీచంద్ రెడ్డి దీక్షలు చేయనున్నారు.