గ్రూప్​1 పై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి

గ్రూప్​1 పై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి

కొహెడ, వెలుగు : గ్రూప్​1 ఎగ్జామ్​పై సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్​ చేస్తూ  గురువారం కొహెడలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. పరీక్షల రద్దుకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలన్నారు.

ALSO READ  : రాష్ట్రంలో వైద్య విప్లవం .. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నం: హరీశ్ రావు

టీఎస్పీఎస్సీ చైర్మెన్​ జనార్దన్​రెడ్డితో సహా కమిటీ సభ్యులను తొలగించి కొత్త కమిటీ నియమించాలన్నారు.  కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, నాయకులు వెంకటస్వామి, శంకర్​, శ్రీనివాస్​, అశోక్​, రవి, సుధాకర్, కిషన్​ ఉన్నారు.