న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో 38 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా ప్రకటించింది. మొత్తం 175 స్థానాలకు గాను గతంలో 114 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా 38 స్థానాలకు క్యాండి డేట్లను ఖరారు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ సోమవారం లిస్ట్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ప్రకటించిన 10 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 142కు చేరింది.
మరోవైపు 25 లోక్సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ 20 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా అరకు లోక్ సభ స్థానం, 8 అసెంబ్లీ స్థానాలను సీపీఎంకు కేటాయించారు. దీంతో నాలుగు లోక్ సభ, మిగిలిన అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోసం ఈ నెల 18 న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25తో ముగియనున్నది.