ఈడీ విచారణతో రాహుల్ గాంధీని మానసికంగా వేధిస్తున్నారు

ఈడీ విచారణతో రాహుల్ గాంధీని మానసికంగా వేధిస్తున్నారు

ఈడీ విచారణతో రాహుల్ గాంధీని బీజేపీ మానసికంగా వేధిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కష్టాల్లో ఉన్నప్పుడు 90 కోట్లు ఇచ్చి షేర్లు మాత్రమే బదిలీ చేశారని..యంగ్ ఇండియా కంపెనీ ద్వారా ఎటువంటి ట్రాన్సక్షన్స్ జరగలేదన్నారు. దేశంలో సోనియా, రాహుల్ గాంధీలకు పెరుగుతున్న ప్రజాధారణను చూసి బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. గతంలో జనతా సర్కార్ ఇందిరా గాంధీని మానసికంగా హింసించిందని..ఇప్పుడు రాహుల్ గాంధీని మోడీ సర్కార్ అలాగే చేస్తోందని ఆరోపించారు. ఇక వానాకాలం సీజన్ ప్రారంభమైనా ఇప్పటి వరకు రాష్ట్రప్రభుత్వం  రైతుబంధు నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు.  వెంటనే రైతు బంధు విడుదల చేసి, రుణమాఫీ పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.