వికారాబాద్, వెలుగు: పంద్రాగస్టు నాటికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చేవెళ్ల కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి చెప్పారు.ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోమన్నారు. సోమవారం ఆయన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లి, ఇందూర్, తట్టేపల్లి గ్రామాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్నిర్వహించారు.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని అంబానీ, అదానీ సొత్తుగా మార్చేశారని, గ్యాస్, పెట్రోలు, డీజిల్, నిత్యవసరాల ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. బీజేపీని గద్దె దించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఓటుతో బీజేపీ అరాచక పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు.
ఏ సర్వే చూసినా చేవెళ్లలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని వస్తోందన్నారు. తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం అందలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అందజేస్తోందన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. రంజిత్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు.