ప్రధాని మోడీతో కోమటిరెడ్డి భేటీ..అభివృద్ధి పనులపై చర్చ

ప్రధాని మోడీతో కోమటిరెడ్డి భేటీ..అభివృద్ధి పనులపై చర్చ

ప్రధాని మోడీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. 15 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది. తన నియోజకవర్గ అభివృద్ధి పనులపై మోడీకి వినతిపత్రం అందజేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. నల్గొండలో కాలుష్యం కారణంగా మూసీ పరివాహక ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతోందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నమామి మూసీ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్, విజయవాడ హైవే గురించి ప్రధాని దృష్టికి పలు అంశాలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకెళ్లనున్నారు.మెట్రో, ఎంఎంటీఎస్‭కు సంబంధించి పలు అంశాలపై కోమటిరెడ్డి ప్రధాని వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.