అధికారంలోకి రాగానే  ఆ అధికారుల సంగతి చూస్తా : ఎంపీ ఉత్తమ్

అధికారంలోకి రాగానే  ఆ అధికారుల సంగతి చూస్తా : ఎంపీ ఉత్తమ్

హాలియా, వెలుగు : సిట్టింగ్ ఎంపీ గా ఉండి అధికారులతో ఇబ్బందులు పడుతున్నానని, తాము అధికారంలోకి రాగానే ఒకవైపు ఉన్న ఆఫీసర్ల  సంగతి చూస్తామని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం నల్గొండ జిల్లా హాలియాలోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వ తీరుతో సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇస్తే ... రాష్ట్రంలో బాగుపడ్డది మాత్రం ఒక్క సీఎం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే అని అన్నారు. మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత వివాదాలను సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. డీసీసీ అధ్యక్షుడు కేతావత్​ శంకర్ నాయక్, పీసీసీ సభ్యులు కర్నాటి లింగారెడ్డి, రాష్ట్ర నాయకులు కుందూరు జైవీర్ రెడ్డి, కాకునూరి నారాయణ గౌడ్, తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కుందూరు వెంకటరెడ్డి, చింతల చంద్రారెడ్డి, వెంపటి శ్రీనివాస్, గౌని రాజా రమేశ్​యాదవ్, నరేందర్​రెడ్డి, శంకర్​నాయక్​ పాల్గొన్నారు.