నిజామాబాద్ : ఆకతాయిల ఫోన్ కాల్ తో సూసైడ్ చేసుకున్నాడు ఓ వ్యక్తి. రోటరీ నగర్ కు చెందిన దాసరి గణేష్ ఇటీవల జరిగిన MPTC ఎన్నికల్లో పోటీ చేశాడు. కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒడిపోతావని నాలుగు రోజుల క్రితం గణేష్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారట. దీంతో రెండు రోజులుగా దిగులుగా ఉన్న అతడు ..మనస్థాపంతో బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
సిరికొండ మండలం రామడుగులో ఎంపీటీసీగా పోటీ బరిలో ఉన్నాడు దాసరి గణేష్. మొదటి సారిగా ఎంపీటీసీగా నిలబడ్డాడని చెబుతున్నారు. దాసరి గణేష్ మృతి తో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. గణేష్ కి ఇద్దరు పిల్లలు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.