
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వచ్చే నెల 24 న హైదరాబాద్కు రానున్నారు. అదే రోజున పీసీసీ ఆధ్వర్యంలో జరిగే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొని ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
వాస్తవానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన భారీ సభను పీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏదో ఒక చోట ఏర్పాటు చేసి, ఆ సభకు చీఫ్ గెస్టుగా ఖర్గేను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ భావించారు. ప్రస్తుతానికి మాత్రం పీఏసీ మీటింగ్కు ఆయనను ఆహ్వానిస్తున్నారు.