1200 మందిని కాంగ్రెస్ బలితీసుకుంది : బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్

1200 మందిని కాంగ్రెస్ బలితీసుకుంది : బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్

హైదరాబాద్, వెలుగు: ఉద్యమంలో 1200 తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు  కాంగ్రెస్ పార్టీనే కారణమని బీజేపీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. ఈ నిజాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని తెలిపారు.

బీఆర్ఎస్ ఎలా ఉద్యమ ఆశయాలను నీరుగార్చి, రాష్ట్రాన్ని దోచుకున్నదో ప్రజలకు తెలుసని పేర్కొంటూ గురువారం ట్వీట్ చేశారు. కాంగ్రెస్ బలితీసుకుంటే బీఆర్ఎస్ దోచుకుందని ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు.