హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లాలోని 12కు 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నది నాయకుల కోసం కాదని, 4 కోట్ల మంది ప్రజల కోసమని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్లోని తన ఇంటి వద్ద కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. పోలింగ్కు కేవలం 32 రోజుల టైమే ఉందని.. ప్రతి గ్రామంలోనూ ప్రచారం చేస్తామని తెలిపారు.
ఒక్కసారి కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని వదులుకున్నానని, నిరాహార దీక్ష చేశానని తెలిపారు. కేసీఆర్లా గ్లూకోజ్నిరాహార దీక్ష చేయలేదని, హరీశ్రావులా పెట్రోల్ పోసుకుని దొంగ బెదిరింపులకు పాల్పడలేదని చెప్పారు. భువనగిరిలో 40 ఏండ్ల చరిత్రను తిరగరాయాలన్నారు. విభేదాలను పక్కనపెట్టి కార్యకర్తలంతా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయేనని ఆనాడు ఆమె కాళ్లు మొక్కిన కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్ గ్యారంటీ లేని పార్టీ అని అంటున్నారని విమర్శించారు. కేసీఆర్ బంధువులు కూడా బీఆర్ఎస్ను నమ్మకుండా కాంగ్రెస్లో చేరుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఏ ఒక్క ప్రాజెక్టుకూ చిన్న గీత కూడా పడలేదని, కానీ కేసీఆర్కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లకే దెబ్బతింటున్నదని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.