గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి..జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన 

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి..జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన 

జీడిమెట్ల, వెలుగు: గంజాయి తనిఖీలకు వెళ్లిన ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.  చింతల్​లోని సాయిభవాని నగర్​కు చెందిన ప్రవీణ్​కుమార్ (38) బాలానగర్ ఎస్ వోటీలో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నారు.

శనివారం రాత్రి డ్యూటీలో భాగంగా కుత్బుల్లాపూర్​లోని ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్ వోటీ పోలీసులు తనిఖీలకు వెళ్లారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన ప్రవీణ్ స్పాట్ లోనే కుప్పకూలిపోయారు.  దీంతో తోటి సిబ్బంది వెంటనే ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఆదివారం అధికారిక లాంఛనాలతో ప్రవీణ్​ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.