
జీడిమెట్ల, వెలుగు: గంజాయి తనిఖీలకు వెళ్లిన ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. చింతల్లోని సాయిభవాని నగర్కు చెందిన ప్రవీణ్కుమార్ (38) బాలానగర్ ఎస్ వోటీలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు.
శనివారం రాత్రి డ్యూటీలో భాగంగా కుత్బుల్లాపూర్లోని ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్ వోటీ పోలీసులు తనిఖీలకు వెళ్లారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన ప్రవీణ్ స్పాట్ లోనే కుప్పకూలిపోయారు. దీంతో తోటి సిబ్బంది వెంటనే ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఆదివారం అధికారిక లాంఛనాలతో ప్రవీణ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.