Consumer Alert: క్రెడిట్‌ కార్డు, ఏటీఎం నుంచి గ్యాస్‌ సిలిండర్‌ వరకు..జూన్1 నుంచి కొత్త రూల్స్..

Consumer Alert: క్రెడిట్‌ కార్డు, ఏటీఎం నుంచి గ్యాస్‌ సిలిండర్‌ వరకు..జూన్1 నుంచి కొత్త రూల్స్..

ఇవాళ్టి(జూన్​1) నుంచి దేశమంతటా ఆర్థికపరమైన కొత్త రూల్స్​అమలులోకి వచ్చాయి. బ్యాంకింగ్​, డిజిటల్​ చెల్లింపులు, గ్యాస్​ ధరల నిర్ణయం, మ్యూచువల్​ ఫండ్స్ నిబంధనల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇవి వినియోగదారులపై మరింత ప్రభావాన్ని చూపనున్నాయి. ఆ కొత్త రూల్స్​ఏంటో తెలుసుకుందాం.. 

క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్​..

జూన్​ 1, 2025 నుంచి క్రెడిట్ కార్డ్ కు సంబంధించి కొత్త రూల్స్​ అమలులోకి వచ్చాయి. కార్టు హోల్డర్లు గణనీయమైన మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. రెంట్​, బీమా, యూటిలిటీ చెల్లింపులపై రివార్డ్​ పాయింట్​ పరిమితం చేయవచ్చు. 

ఆటోడెబిట్​ జరిమానాలు తగ్గనున్నాయి. సమయానికి ఖాతాలో డబ్బులు లేకపోతే ఆటోడెబిట్ విఫలమైతే విధించే ఫైన్​ 2 శాతం తగ్గే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్​ లావాదేవీల ఫీజులు కూడా మారే అవకాశం ఉంది. 

ATM విత్​ డ్రాలు,LPG ధర ల్లో మార్పులు 

ATM ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. నెలవారీ ఫ్రీ విత్​ డ్రా లిమిట్​ మించితే ATM ఛార్జీల మోత తప్పదు. కస్టమర్లు ఆయా బ్యాంకుల రూల్స్ చెక్ చేసుకోవాలి. 
LPG సిలిండర్ ధరలు జూన్​ 1నుంచి మారనున్నాయి. ప్రతి నెల 1వ తేదీన LPG ధరలు సవరిస్తారు. చమురు కంపెనీ నవీకరణలను బట్టి వాణిజ్య LPG ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

ALSO READ | మేనెలలో పెరిగిన జీఎస్టీ కలెక్షన్లు..16.4 శాతం అదనంగా వసూలు

ఫిక్స్డ్​డిపాజిట్లపై ప్రభావం: కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది.  ఇది ఫిక్స్​ డ్​ డిపాజిట్​ హోల్డర్లపై ప్రభావితం చేయవచ్చు.

ఉచిత ఆధార్ అప్డేట్స్​.. 

ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్స్​ చేసుకునేందుకు చివరి తేది జూన్ 14, 2025. ఆ తర్వాత ఆన్​ లైన్​ అప్డేట్స్​ కోసం రూ.25 లు, ఆధార్​ కేంద్రాల్లో రూ.50 లు ఛార్జీలు వసూలు చేస్తారు. EPFO 3.0: UPI తో PF విత్డ్రాలు..

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) EPFO ​​3.0 ను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా సభ్యులు UPI  లేదా ATMల ద్వారా PF డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.మొదట్లో GPF ,PPF కసటమర్లకు పైలట్ ప్రాజెక్టుగా EPFO 3.0 అందుబాటులోఉంటుంది.

UPI లావాదేవీల కొత్త రూల్స్​ ..

జూన్ 30, 2025 నుంచి అన్ని UPI యాప్‌లు కస్టమ్ లేబుల్‌లకు బదులుగా  ఉదాహరణకు రాజు కిరాణా షాప్ వంటివి కాకుండా బ్యాంక్ పేరును డిస్​ ప్లేచేయాల్సి ఉంటుంది. మోసాలను అరికట్టేందుకు సహాయపడుతుంది. 

మ్యూచువల్ ఫండ్ కట్-ఆఫ్ టైం..

మ్యూచువల్ ఫండ్ లావాదేవీలకు సెబీ కొత్త కటాఫ్ టైం ప్రకటించింది. ఆఫ్‌లైన్ లావాదేవీలకు కటాఫ్ ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలు. దీనికి ముందు సమర్పించిన ఆర్డర్‌లకు అదే రోజు NAV లభిస్తుంది.ఆన్‌లైన్ లావాదేవీలకు కొత్త కటాఫ్ సాయంత్రం 7 గంటలు . దీనికి ముందు ఆర్డర్‌లకు అదే రోజు NAV కూడా అందుతుంది.
డ్రైవింగ్ లైసెన్స్ నియమాల్లో ఎటువంటి మార్పులు లేవు. 2025లో కూడా జూన్ 2024లో ప్రవేశపెట్టిన నియమాలే వర్తిస్తాయి.