
జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. గత మేనెలతో పోలిస్తే 16.4 శాతం పెరిగాయి. మేనెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2.01 లక్షల కోట్లకు చేరాయి. జీఎస్టీ వసూళ్లు దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పురోగతిని, పటిష్టమైన పన్ను వసూళ్ల వ్యవస్థను ప్రతిబింబిస్తున్నాయి. చెప్పుకోదగ్గ వార్షిక వృద్ధిని సూచిస్తుంది. ముఖ్యంగా జీఎస్టీ వసూళ్లు వరుసగా రెండవ నెలలో రూ. 2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించడం ఆర్థిక కార్యకలాపాలలో స్థిరమైన వృద్ధిని ,పన్ను వసూళ్ళలో మెరుగుదలను సూచిస్తోంది. అయితే 2025 ఏప్రిల్ లో రూ.2.37లక్షల కోట్ల వసూళ్ల కంటే స్వల్పంగా తగ్గాయి.
ALSO READ | Zepto: ఎక్స్ పైరీ అయిన ప్యాకెట్లు.. బూజు పట్టిన పదార్థాలు.. జెప్టో లైసెన్స్ రద్దు
ఈ వృద్ధి ప్రధానంగా దిగుమతుల నుంచి వచ్చే జీఎస్టీలో గణనీయమైన పెరుగుదల సూచిస్తోంది. విదేశీ దిగుమతులనుంచి వసూళ్లు 25.2శాతంగా ఉన్నాయి. అదేవిధంగా దేశీయ లావాదేవీల నుంచి 13.7శాతం వృద్ధి సాధించాయి. అదే సమయంలో మొత్తం రీఫండ్లలో 4శాతం తగ్గుదల కనిపించడం నికర ఆదాయాన్ని మరింత పెంచింది. ఇది పన్ను పరిపాలనలో మెరుగైన సామర్థ్యాన్ని ,లీకేజీని తగ్గించడాన్ని సూచిస్తుంది.
ఈ గణాంకాలు ఆర్థిక వ్యవస్థలో బలమైన అంతర్గత పురోగతి, స్థిరమైన పునరుద్ధరణకు నిదర్శనం అంటున్నారు ట్యాక్స్, ఎకనామిక్స్ ఎనలిస్టులు.జీఎస్టీ వసూళ్లలో స్థిరత్వం ప్రభుత్వానికి గణనీయమైన ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. భవిష్యత్తులో పన్ను సంస్కరణలు, ముఖ్యంగా రేటు సవరణకు అవకాశం కల్పిస్తుందంటున్నారు.
ఆదాయం ఇలా..
మే 2025లో సెంట్రల్ జీఎస్టీ (CGST) ఆదాయం రూ.35వేల434 కోట్లు కాగా స్టేట్ జీఎస్టీ (SGST) ఆదాయం రూ.43వేల902 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) సుమారు రూ.1.09 లక్షల కోట్లు. సెస్ నుంచి ఆదాయం రూ.12వేల879 కోట్లు.
నికర ఆదాయం ,రీఫండ్ డైనమిక్స్:
రీఫండ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మే 2025లో నికర జీఎస్టీ వసూళ్లు సుమారు రూ.1.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇది మే 2024లో వసూలు చేసిన రూ.1లక్షల44వేల381 కోట్లతో పోలిస్తే 20.4శాతం వార్షిక వృద్ధిని సూచిస్తుంది. మే నెలలో మొత్తం రీఫండ్లు 4శాతం తగ్గి రూ.27వేల210 కోట్లకు చేరుకున్నాయి.