CBSE టెన్త్ క్లాస్ సెకండ్ బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదల

CBSE టెన్త్ క్లాస్ సెకండ్ బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదల

CBSE 10వ తరగతి సెకండ్ బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ను శనివారం ప్రకటించింది.  పరీక్షకు హాజరైన విద్యార్థులు DigiLocker Results Portal ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చని CBSE తెలిపింది. CBSE మెయిన్, సెకండ్ బోర్డ్ రిజల్ట్స్ మొత్తం కలిపాక.. ఈ విద్యా సంవత్సరానికి మొత్తం ఉత్తీర్ణత శాతం 96.78% చేరింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020 సిఫార్సులకు అనుగుణంగా, CBSE 2026 నుంచి 10వ తరగతికి రెండు బోర్డు పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

CBSE మెయిన్ టెన్త్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకూ జరిగాయి. సెకండ్ బోర్డ్ ఎగ్జామ్స్ మే 15 నుంచి మే 21 వరకూ జరిగాయి. సెకండ్ బోర్డ్ ఎగ్జామ్స్కు 6 లక్షల 64 వేల 27 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో.. 6 లక్షల 63 వేల 777 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విదేశాల్లో ఉన్న CBSE అనుబంధ పాఠశాలల విద్యార్థులు కూడా DigiLocker Results Portalలో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని CBSE తెలిపింది.