కరకగూడెం, వెలుగు : కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామం లో వ్యవసాయ పొలంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లో కాపర్ వైరు సోమవారం రాత్రి చోరీకి గురైంది. విలువ రూ.1.20వేలు ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు.
గడిచిన రెండు నెలల్లో మండలంలో 5 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి కాపర్ వైరు దొంగిలించడంతో మండలంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దృష్టి సారించి ట్రాన్స్ఫార్మర్లు చోరీలకు గురికాకుండా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.
