కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ కాపర్ వైరు చోరీ

 కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ కాపర్ వైరు చోరీ

కరకగూడెం, వెలుగు :  కరకగూడెం  మండలం భట్టుపల్లి గ్రామం లో వ్యవసాయ పొలంలోని విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్ లో కాపర్​ వైరు సోమవారం రాత్రి చోరీకి గురైంది. విలువ రూ.1.20వేలు ఉంటుందని విద్యుత్ శాఖ  ఏఈ తెలిపారు.

 గడిచిన రెండు నెలల్లో  మండలంలో 5 ట్రాన్స్​ఫార్మర్లు ధ్వంసం చేసి కాపర్​ వైరు దొంగిలించడంతో  మండలంలోని   రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దృష్టి సారించి ట్రాన్స్​ఫార్మర్లు చోరీలకు గురికాకుండా చూడాలని రైతులు  వేడుకుంటున్నారు.