ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

గడచిన 24 గంటల్లో 1886 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య తగ్గిపోతోంది. గడచిన 24 గంటల్లో మొత్తం 67,910 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,886 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా ప్రారంభం నుంచి ఇవాళ్టి వరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కరోనా నిర్ధారణ  కోసం చేసిన పరీక్షల సంఖ్య 87 లక్షల 92 వేల 935కు చేరుకుంది. అలాగే గడచిన 24 గంటల్లో కరోనాతో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాల్లో ఒకరు చొప్పున మొత్తం 12 మంది కరోనా పాజిటివ్ బాధితులు చనిపోయారు. మరో వైపు గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2151 మంది కరోనా నుండి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు.