రాష్ట్రంలో పూర్తిగా తగ్గుముఖం పట్టిన కరోనా

రాష్ట్రంలో పూర్తిగా తగ్గుముఖం పట్టిన కరోనా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వారం రోజుల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. పెద్దపల్లి, వనపర్తి, నిజామాబాద్, నారాయణపేట, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. సూర్యాపేట, నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్, మహబూబాబాద్, మహబూబ్‌‌‌‌నగర్, గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండేసి కేసులే వచ్చాయి. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ 10 కంటే తక్కువే రికార్డవుతున్నాయి. ఈ మేరకు సోమవారం కరోనా బులెటిన్‌‌‌‌లో వారం రోజుల కేసుల వివరాలను పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలో 30 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.16కు పడిపోయిందని, వెయ్యి మందికి టెస్ట్ చేస్తే ఒకరిద్దరికే పాజిటివ్ వస్తోందని తెలిపారు.