బండ్లగూడ ఏరియాలో కరోనా కలకలకం

బండ్లగూడ ఏరియాలో కరోనా కలకలకం

రంగారెడ్డి జిల్లా: బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలోని పిరన్ చెరువు విలేజ్ లో కరోనా కలకలం సృష్టించింది. ఓ  అపార్ట్ మెంట్ లో 10 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.  అతని నుంచి అపార్ట్ మెంట్ లో ఉన్న మిగతా వాళ్ళకి  వైరస్ సోకింది.  అప్రమత్తమైన బండ్లగూడ మున్సిపల్ సిబ్బంది.... అపార్ట్ మెంట్ మొత్తం శానిటేషన్ చేశారు. రేపు ప్రతి ఒక్కరికి రాపిడ్ టెస్టులు చేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.