27 మందికి కరోనా: గ్రామంలో లాక్ డౌన్

27 మందికి కరోనా: గ్రామంలో లాక్ డౌన్

జగిత్యాల జిల్లా  : మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో లాక్ డౌన్ విధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. గ్రామంలో 27 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని హోటళ్లు, కటింగ్ షాపులతో పాటు అన్ని దుకాణాలు ఈ నెల 15 వరకు మూసివేయనున్నారు. కిరాణా దుకాణాలు ఉదయం 6 నుంచి 10 వరకు,  సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలని డిసైడ్ అయ్యారు.  షాపులకు వచ్చే వారికి మాస్కులు ఉంటేనే వస్తువులు ఇవ్వాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంగిస్తే 1000 జరిమానా విధించనున్నట్లు తెలిపారు..