దేశంలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. నిన్న 41,100 కేసులు నమోదవడంతో దేశంలో పాజిటివ్ కేసులు 88,14,579 కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 447మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 1,29,635 కు చేరింది. నిన్న మరో 42,156 మంది కోలుకున్నారు. మొత్తం దేశ వ్యాప్తంగా నిన్నటి వరకు 82,05,728 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 479216 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 8,05,589 మందికి టెస్టులు చేశారు. దీంతో నవంబర్ 14 వరకు దేశంలో కరోనా టెస్టుల సంఖ్య మొత్తం  12 కోట్ల 48లక్షల 36 వేల 819 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

బేగంబజార్ లోని ట్రాన్స్ పోర్ట్ గోదాంలో అగ్ని ప్రమాదం