టీటీడీలో 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌

టీటీడీలో 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్‌ తన ప్రతాపాన్ని కొనసాగిస్తోంది. దీంతో రోజు రోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దాదాపు అన్ని ప్రాంతాలతో పాటు… తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా పాకింది. టీటీడీ సిబ్బందిలో 80 మంది కరోనా బారినపడినట్టు కలెక్టర్ ఎన్.గుప్తా తెలిపారు. టీటీడీలో ప్రతి రోజు 200 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. లేటెస్టుగా కరోనా బారిన పడిన సిబ్బందికి… భక్తుల ద్వారా సోకినట్టు ఆధారాలు లేవన్నారు. ఇప్పటి వరకు 800 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగటివ్ ఫలితాలు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన సిబ్బంది అందరినీ హోం క్వారంటైన్‌, ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. భక్తుల ఆరోగ్యమే ధ్యేయంగా టీటీడీ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు పలు ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. అలిపిరి దగ్గర, శ్రీవారి ప్రధాన ద్వారం దగ్గర స్ర్పేయింగ్‌ మిషన్లను ఏర్పాటు చేశామన్నారు.