
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కోనసాగుతోంది. సామాన్య ప్రజల తో పాటు అధికారులను, రాజకీయనాయకులను ఎవరినీ వదలడం లేదు. అందరిపైనా తన ప్రతాపం చూపిస్తోంది. లేటెస్టుగా ఆ రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి నిలోఫర్ కఫిల్ కు కరోనా సోకింది. కరోనా లక్షణాలతో ఆమె గత మూడు రోజులుగా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటుంన్నారు. లేటెస్టుగా నిర్వహించిన పరీక్షల్లో ఆమెకి పాజిటివ్ వచ్చింది. దీంతో సీఎం కే పళనిస్వామి మంత్రి మండలిలో కరోనా బారినపడిన మంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది. నిలోఫర్ సహచర మంత్రి ఓఎస్ మణియన్ కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఆయన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొదట మంత్రి కేపీ అన్బళగన్కు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా నుంచి కోలుకున్న ఆయన ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జి అయ్యారు. తర్వాత మంత్రులు సెల్లూర్ కే రాజు, పీ తంగమణి కరోనా బారినపడ్డారు.