ప్రతి రోజూ 100 మంది స్టాఫ్ కు కరోనా వ్యాక్సినేషన్

ప్రతి రోజూ 100 మంది స్టాఫ్ కు కరోనా వ్యాక్సినేషన్

విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ స్టాఫ్ కు  కరోనా వ్యాక్సిన్ సేవలు ప్రారంభమయ్యాయి. మొత్తం 800 సిబ్బందికి.. ప్రతిరోజూ 100 మంది చొప్పున 8 రోజుల పాటు ఈ సేవలను అందిస్తున్నారు. ఫేస్-1 (మొదటిదశ)ను పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రెండవదశలో.. అంటే 28 రోజుల తర్వాత తీసుకోవాలన్నారు . ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ విజయవాడ హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సినేషన్ సేవలను మా స్టాఫ్ కి అందించడం ఎంతో సంతోషంగా ఉందని.. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు అందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదకరమైన కోవిడ్ ను నియంత్రించే క్రమంలో మన దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఎంతోమంది పరిశోధకుల కృషి ఉందన్నారు. ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు..