న్యూఢిల్లీ : కారుగేటెడ్ (మడత పెట్టిన) ప్యాకేజింగ్ మెషినరీ పరిశ్రమ కోసం ‘కార్రు ప్యాక్ ప్రింట్ ఇండియా ఎక్స్పో 2024’ ను ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఎక్స్పో సెంటర్లో మార్చి 7 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు.
ఇండియన్ పేపర్ కారుగేటేడ్, ప్యాకేజింగ్ మెషినరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐసీపీఎంఏ) ఫ్యూచరెక్స్ గ్రూప్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి ఈ ఎక్స్పో లో కారుగేటెడ్ ప్యాకేజింగ్ మెషినరీ రంగంలోని ప్రముఖ తయారీదారులు పాల్గొంటారు.
తమ తాజా ఉత్పత్తులను, అత్యాధునిక యంత్రాలను ప్రదర్శిస్తారు. 2020 ఆర్థిక సంవత్సరంలో సుమారు 75 బిలియన్ డాలర్ల విలువ కలిగిన భారతీయ ప్యాకేజింగ్ పరిశ్రమ ఏటా18-–20శాతం సీఏజీఆర్ను సాధిస్తోంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరం నాటికి దాదాపు 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.