
- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి జిల్లా: అబద్ధాలు చెప్పే అవినీతి సీఎం కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ప్రజల సొమ్ము ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు ఖర్చు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. మంగళవారం కమాన్ పూర్ మండల కేంద్రంలో బీజేపీ సమావేశంలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. సమావేశం కోసం వచ్చిన వివేక్ వెంకటస్వామికి బీజేపీ నేత సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కమాన్ పూర్ లో బీజేపీ బైక్ ర్యాలీలో పాల్గొని బైక్ నడిపి కార్యకర్తల్లో హుషారు నింపారు వివేక్ వెంకటస్వామి.
ఈ సందర్భంగా నిర్వహించిన బీజేపీ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు పార్టీలో చేరగా.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వివేక్, సునీల్ రెడ్డి. ఉద్యమ సమయంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆయనే సీఎం అయ్యాక వారికే దోచిపెడుతున్నాడని ఆరోపించారు. మన ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం కేసీఆర్ ఖర్చు పెడుతున్నాడన్నారు. బీజేపీ న్యాయం, ధర్మం, నీతి గల పార్టీ అని వివరించారు. రైతులకు కేంద్రం ఎకరానికి ఆరువేల రూపాయలు ఇస్తోందని, ఎన్నో పథకాలను కేంద్రం పేద ప్రజలకు ఇస్తుంటే వాటిని తమ పథకాలు గా టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటోందన్నారు. తెలంగాణ ప్రజలు తెలివి గల వారని, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ఉక్రెయిన్ నుంచి వచ్చిన స్టూడెంట్ల కోసం కీలక ప్రకటన
కేసీఆర్కు ప్రజా సమస్యలు పట్టవు
అసెంబ్లీని టీఆర్ఎస్ సభ్యులు కౌరవసభలా మార్చిన్రు