ఉక్రెయిన్ నుంచి వచ్చిన స్టూడెంట్ల కోసం కీలక ప్రకటన

ఉక్రెయిన్ నుంచి వచ్చిన స్టూడెంట్ల కోసం కీలక ప్రకటన

ఉక్రెయిన్ లో చిక్కుకొని చదువులు మధ్యంతరంగా వదిలేసి వచ్చిన తెలంగాణ విద్యార్థులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అన్నారు. ‘దాదాపు 740 మంది విద్యార్థులు మెడిసిన్ చదువుకోవడానికి ఉక్రెయిన్ వెళ్లారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో వారందరూ ఉన్న పళంగా తిరిగొచ్చారు. వారి స్టడీ ఇయర్ వృధా కానివ్వం. వారందరి చదువుకు అయ్యే ఖర్చు తెలంగాణ ప్రభుత్వం భరించి.. చదివిస్తుంది’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.