కేసీఆర్కు ప్రజా సమస్యలు పట్టవు

కేసీఆర్కు ప్రజా సమస్యలు పట్టవు

పెద్దపల్లి జిల్లా: కేసీఆర్ కు  తన కుటుంబ అభివృద్ధి తప్ప ప్రజా సమస్యలు పట్టవని, ఎప్పుడు చూసినా ఫాం హౌజ్లోనే ఉంటారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మంగళవారం జిల్లాలోని మంథని మండలం బిట్టుపల్లి గ్రామంలో బీజేపీ జెండాను వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వివిధ పార్టీల నుంచి దాదాపు వంద మంది బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డబుల్ బెడ్రూం ఇళ్లు, హాస్పిటల్స్ కట్టమంచే చేతకాదు గానీ తన కోసం మాత్రం పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతికి కేసీఆర్ పాల్పడారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నిరాశ్రయులైనవారికి ఇప్పటివరకు కేసీఆర్ చేసింది శూన్యమన్నారు.

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేశానని చెప్పుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని బంగారు భారత్ చేస్తానంటూ  గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. తానెన్నీ ముచ్చట్లు చెప్పిన పీఎం నరేంద్ర మోడీ చరిష్మా ముందు నిలువలేరన్నారు. ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీ సుపరిపాలనకు కొలమానమన్నారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు మోడీ తీసుకున్న చొరవ చాలా గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి వెంట బీజేపీ లీడర్ సునీల్ రెడ్డి, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

మన మిసైల్ వ్యవస్థ పూర్తిగా సేఫ్

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు తీర్పు

ఐపీఎల్ నిబంధనల్లో కీలక మార్పులు