
హైదరాబాద్: అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యుల తీరు చూస్తుంటే కౌరవ సభలా అనిపిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సభలో అధికార పార్టీ సభ్యులు అన్పార్లమెంటరీ పదాలు మాట్లాడారన్నారు. స్పీకర్ కూడా తాను ఒక కాంట్రాక్టర్ననే చెప్పారన్నారు. అయితే స్పీకర్ను సభాధిపతిగానే చూస్తామని.. కాంట్రాక్టర్ అని పిలవలేమన్నారు. కోమటిరెడ్డిని టీఆర్ఎస్ నేతలు పదే పదే కాంట్రాక్టర్ అనడం సరికాదని మండిపడ్డారు. సభ్యులకు బిజినెస్లు ఉంటాయని.. వారి వృత్తి గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. సభలో మంత్రుల వ్యవహారం బాగోలేదన్న భట్టి.. ఇరిగేషన్లో జరిగిన అవినీతి బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగిందన్నారు.
మరిన్ని వార్తల కోసం: