వీడియో.. చెత్త రిక్షాపై కరోనా మృతదేహం

వీడియో.. చెత్త రిక్షాపై కరోనా మృతదేహం

బిహార్ లో కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బిహార్-ఉత్తరప్రదేశ్ లోని సరిహద్దు ప్రాంతాల్లో గంగా నదిలో శవాలు తేలుతున్నాయి. నలందలో కరోనా బాధితుడి శవాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన చెత్త తీసుకెళ్లే రిక్షాలో తీసుకెళ్లారు. ఆంబులెన్స్ లు, మార్చురీ వ్యాన్ లు అందుబాటులో లేకపోవడంతో PPE కిట్స్ వేసుకున్న ఇద్దరు శవాన్ని చెత్త రిక్షాలో తీసుకెళ్లడం కనిపించింది. ఈ విషయం హాస్పిటల్ అధికారుల దృష్టికి వెళ్లగా... విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.