గోవా వెళ్తున్నారా?.. ఇవి తీసుకెళ్లకుంటే రానివ్వరంట!

గోవా వెళ్తున్నారా?.. ఇవి తీసుకెళ్లకుంటే రానివ్వరంట!

పనాజీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో టూరిజంకు పేరుపొందిన గోవా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి వచ్చే టూరిస్టులకు ప్రమోద్ సావంత్ సర్కార్ పలు నిబంధనలు విధించింది. కొవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉన్న వారు లేదా టీకా తీసుకున్న వారిని మాత్రమే గోవాలోకి అనుమతిస్తామని ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వచ్చే వారం నుంచి దీన్ని అమలు చేయనున్నామని తెలిపారు. ‘గోవాకు వచ్చే టూరిస్టులు  ఆర్‌టీ పీసీఆర్ టెస్టు నెగిటివ్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ చేయించుకున్న వారు దాని తాలూకు ప్రూఫ్‌లను అందజేయాలి’ అని సావంత్ పేర్కొన్నారు.