కీసర, వెలుగు: అక్రమంగా ఆవులను తరలిస్తున్న రెండు డీసీఎంలను కీసరలో వీహెచ్పీ నేతలు గురువారం పట్టుకున్నారు. వాహనాలను ఆపాలని సూచించినా వినకుండా వెళ్లడంతో డీసీఎం అద్దాలను పగలగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వాహనాలతోపాటు ఇద్దరు డ్రైవర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడ్డ ఆవులను హైజా లేదా జియగూడ గోశాలకు తరలిస్తామన్నారు.
