![జిల్లాలో 8 స్పెషల్ టాస్క్ఫోర్స్ టీంలు: అభిషేక్మహంతి](https://static.v6velugu.com/uploads/2023/11/cp-abhishek-mahanty_42CjSmw81l.jpg)
కరీంనగర్ క్రైం వెలుగు : ఎన్నికల దృష్ట్యా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 8 స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశామని సీపీ అభిషేక్ మహంతి అన్నారు. ఎన్నికల నిర్వహణలో తలెత్తే సమస్యల పరిష్కారంపై జిల్లా పోలీస్ హెడక్వార్టర్స్ సిబ్బందికి మూడు రోజులపాటు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. శనివారం ట్రైనింగ్ముగింపు సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఫిజికల్ ఫిటినెస్, ఆయుధాల వాడకంపై రిఫ్రెష్ కోర్స్ ట్రైనింగ్ఇచ్చామన్నారు.
శాంతి భద్రతల సమస్యలు ఎదురైనపుడు అల్లరి మూకలను చెదరగొట్టడం, తనిఖీలు చేసే తప్పించుకుపోయే వాహనాలను పట్టుకోవడంపై టెక్నిక్స్చెప్పామన్నారు. ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.