గచ్చిబౌలి, వెలుగు : భారీ వర్షాల కారణంగా ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలపై కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఆఫీస్లకు వెళ్లే ఎంప్లాయీస్ సొంత కార్లలో కాకుండా కారు పూలింగ్(షేరింగ్)లో వెళ్లాలని సూచించారు. వీలైనంత వరకు మెట్రో, ఆర్టీసీ వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణించాలని పేర్కొన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్లో ఐటీ కంపెనీల ప్రతినిధులు, హోటల్స్, హాస్పిటల్స్, ఫార్మా కంపెనీల సీఈవోలు, పోలీసు అధికారులతో సీపీ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోని ఐటీ కారిడార్లో వర్షపునీరు నిలిచే రోడ్లను గుర్తించి 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వెంటనే స్పందించేందుకు 10 ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయన్నారు. ఐటీ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రం హోం పని చేసే విధంగా కంపెనీలు చూడాలన్నారు.
ట్రాఫిక్ సమస్య ఉంటే కాల్ చేయాలె..
ఐటీ కారిడార్లో వానలతో తలెత్తే ట్రాఫిక్ సమస్యలు, వాటర్ లాగింగ్ పాయింట్లపై కాల్ చేసేందుకు మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ నం.8712663011, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ నం.8712663010, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ 9490617346, ఏవైనా వెహికల్స్ రోడ్డుపై బ్రేక్డౌన్ అయితే 8333993360 నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయాలని సీపీ తెలిపారు. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు.