ఎవరి కోసం పనిచేస్తున్నారో తేల్చుకోవాలి: నారాయణ

ఎవరి కోసం పనిచేస్తున్నారో తేల్చుకోవాలి: నారాయణ

హైదరాబాద్, వెలుగు: పోలీసులేమన్నా మోడీ ఏజెంట్లా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసులు ప్రధానికి పనిచేస్తున్నారో లేక సీఎం కేసీఆర్ కు పనిచేస్తున్నారో తేల్చుకోవాలన్నారు. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ శనివారం మగ్ధూం భవన్ నుంచి సీపీఐ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా బయల్దేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

దీంతో సీపీఐ, ఇతర ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన విభజన హామీలను  నెరవేర్చకుండా తెలంగాణలోకి అడుగుపెట్టే నైతిక హక్కు మోడీకి లేదని ఫైరయ్యారు. ఈ ర్యాలీ లో సీపీఐ సిటీ సెక్రటరీ నర్సింహా, ఏఐవైఎఫ్ కె.ధర్మేంద్ర పాల్గొన్నారు.