సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ (35) కరోనాతో మృతిచెందారు. ఆయన రెండు వారాల పాటు కరోనాతో పోరాడుతున్నారు. ఆశిష్ ఏప్రిల్ 12 నుంచి గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలోని ఐసీయూలో ఉన్నారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన గురువారం ఉదయం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆశిష్ ఢిల్లీలోని ఓ పత్రికలో సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు.
‘ఈ రోజు ఉదయం నా పెద్ద కొడుకు ఆశిష్ ఏచూరి కోవిడ్ బారినపడి చనిపోయాడు. ఆశిష్కు వైద్యం చేసిన వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వైద్యులు, నర్సులు, ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు మరియు మాకు అండగా వారందరికీ ధన్యవాదాలు’ అని సీతారం ఏచూరి ట్వీట్ చేశారు.