- సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ బీవీ రాఘవులు
ముషీరాబాద్, వెలుగు : చరిత్రను తిరగ రాయడం చేయకుండా, యూనివర్సిటీ పాఠ్యాంశాల్లో చరిత్రను తీసివేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ బీవీ రాఘవులు ఆరోపించారు. పుస్తకాల ద్వారా చరిత్రను బతికించుకోవాలని పేర్కొన్నారు.
పాలగుమ్మి సాయినాథ్ రాసిన ‘లాస్ట్ హీరోస్’కు తెలుగు అనువాదం ‘ఆఖరి యోధులు’ పుస్తకావిష్కరణ సభ సోమవారం రాత్రి బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి , కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.