'క్రేజీ ఫెలో'కి రిలీజ్ డేట్ ఫిక్స్ 

 'క్రేజీ ఫెలో'కి రిలీజ్ డేట్ ఫిక్స్ 

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ తాజాగా నటిస్తున్న చిత్రం 'క్రేజీ ఫెలో'. ఈ సినిమాతో ఫణికృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో హీరోయిన్స్ గా దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. 

ఈ సినిమాను సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్ లో హీరో ఆది సాయి కుమార్ చేతిలో గులాబీ పువ్వులతో ఎదురు చూస్తుండగా, హీరోయిన్స్ సీతాకోక చిలుక రెక్కలుగా కనిపించడం ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోయిన్లు ఇద్దరూ బ్యూటిఫుల్ గా కనిపిస్తుండగా, ఆది లుక్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. 

కాగా, ఇప్పటికే ఈ సినిమా నుండి ఆది ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు పాటలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘బాలా త్రిపుర సుందరి..చాలా నచ్చిందే ఎందుకోమరి’ అన్న పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీకి ఆర్ ఆర్ ధృవ సంగీతం సమకూరుస్తున్నాడు.