ఆదిపురుష్ ఎఫెక్ట్: 'ప్రభాస్'ని అగౌరవపరిచేలా వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్

 ఆదిపురుష్ ఎఫెక్ట్: 'ప్రభాస్'ని అగౌరవపరిచేలా వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్

పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్' హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీపై విమర్శలు ఏమాత్రం తగ్గడం లేదు. హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోగా... రోజులు గడిచేకొద్దీ మూవీ కలెక్షన్స్ భారీగా పడిపోతున్నాయి. అలాగే ఈ సినిమాను విమర్శించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా లెజెండరీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ సినిమాపై సెటైర్లు వేశారు.

ఆదిపురుష్ చిత్రాన్ని తాను చూసినట్లు వెల్లడించిన సెహ్వాగ్.. 'ప్రభాస్'ని అగౌరవపరిచేలా ట్వీట్ చేశారు. "ఈ సినిమా చూసిన తర్వాతనే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో నాకు అర్థమైంది.." అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు. ఆదిపురుష్ సినిమాను ఒప్పుకున్నందుకే బాహుబలి(ప్రభాస్)ని కట్టప్ప చంపాడు.. అని అర్థం వచ్చేలా ఈ ట్వీట్ ఉండటం గమనార్హం. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సెహ్వాగ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. మరికొందరు మాత్రం అతనితో ఏకీభవిస్తున్నారు.

Adipurush dekhkar pata chala Katappa ne Bahubali ko kyun maara tha ?

— Virender Sehwag (@virendersehwag) June 25, 2023

 రామాయణాన్ని వక్రీకరిస్తూ, పాత్రలను ఇష్టం వచ్చినట్లు మార్చేరయడమే ఈ విమర్శలకు ప్రధాన కారణం.