- అదానీ, అంబానీ దేశ సంపదను దోచుకున్నరు
- నేరస్తులకు బీజేపీ ఎంపీ సీట్లు ఇచ్చింది
హైదరాబాద్: మోదీ పరివార్ లో నేరస్తులే ఎక్కువ ఉన్నారని, అదానీ, అంబానీ దేశ సంపదను దోచుకున్నారని ఏఐసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా కోసం మహాలక్ష్మి 500 రూపాయలకు గ్యాస్, ఆరు గ్యారెంటీ స్కీములు అమలు చేస్తున్నయి.
మోదీ పరివార్ లో నేరస్తులే ఉన్నారు. ప్రజ్వల్ రేవన్న వేల మంది మహిళలపై లైంగికదాడి చేశాడు. వారి వీడియోలను చిత్రీకరించడం సిగ్గుచేటు. అలాంటి వ్యక్తి కోసం ప్రధాని మోదీ ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య. మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్ కుటుంబానికి లోక్ సభ సీటును బీజేపీ ఇచ్చింది. కమలం పార్టీ, ఆర్ఎస్ఎస్ మహిళలను వంటింటికే పరిమిత చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే.. మహిళలకు రక్షణ కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం’ అని తెలిపారు.