వర్షాలకు 62 వేల ఎకరాల్లో పంట నష్టం

వర్షాలకు 62 వేల ఎకరాల్లో పంట నష్టం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవానలకు పంటలు నీట మునుగుతున్నా యి. వారం రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 62 వేల ఎకరాల పంట పూర్తిగా నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో వరంగల్ రూరల్, పెద్ద పల్లి, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు జిల్లాల్లోనే 90 శాతం పంటలు ఉన్నాయి. ఎక్కువగా 50 వేల ఎకరాలు వరి పంట, 12, 500 ఎకరాల పత్తి పంట ఎఫెక్ట్ అయ్యింది. పత్తి చేలో చేరిన వాన నీటిని బయటకు డ్రైవ్ చేసి పంటను కాపాడుకోవాలని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.

రూ.15కోట్లతో రిపేర్ చేసినా ఉరుస్తుంది